![]() |
![]() |

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఓనర్స్ అందరు కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. ఇక అప్పుడే బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. రెంటర్స్ లో అందరు డిసైడ్ అయి ఓనర్స్ కేవలం ముగ్గురే కంటెడర్స్ గా సెలెక్ట్ చేసుకోమని చెప్తాడు. దాంతో మనీష్,భరణి, పవన్ డీమాన్ ని గ్రూప్ డిస్కషన్ ద్వారా సెలక్ట్ చేసుకుంటారు.
మమ్మల్ని సెలెక్ట్ చేసుకోకపోవడానికి రీజన్ ఏంటని ప్రియ, శ్రీజ ఇద్దరు రెంటర్స్ పై కోప్పడతారు. ఆ తర్వాత బిగ్ బాస్ ముగ్గురు కంటెండర్స్ ని కలిసి రెంటర్స్ లో ఒకరికిని కంటెండర్ గా సెలక్ట్ చేసుకోమనగా ముగ్గురు డిస్కషన్ చేసుకొని ఇమ్మాన్యుయల్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ మొదలవుతుంది. టాస్క్ పేరు.. రంగు పడుద్ది. దీనికి సంఛాలక్ గా రీతు ఉంటుంది.
అందులో మొదటి రౌండ్ కి మనీష్ అవుట్ అవుతాడు. టాస్క్ జరిగేటప్పుడు సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ లాగే ఆట జరిగింది. ఇమ్మాన్యుయల్, భరణి వాళ్ళు ఇద్దరు అసలు కలర్ పూసుకోకుండా మనీష్ కి పూసి అవుట్ చేసారు. భరణి, ఇమ్మాన్యుయల్ కలిసి డీమాన్ పవన్ ని టార్గెట్ చేశారు. సంఛాలక్ మాటని భరణి విననందుకు అతడిని రీతూ అవుట్ చేసింది. ఇక మిగిలింది ఇమ్మాన్యుయల్, డీమాన్ పవన్. అందులో ఇమ్మాన్యుయల్ టీ షర్ట్ కి ఎక్కువ రంగు ఉండడంతో డీమాన్ పవన్ విన్ అయ్యాడు. ఇలా బిగ్ బాస్ రెండవ ఇంటి కెప్టెన్ గా డీమాన్ పవన్ ఎంపికయ్యాడు.
![]() |
![]() |